ETV Bharat / bharat

ఎన్​కౌంటర్: ముగ్గురు ముష్కరులు హతం- ఎస్పీఓ వీరమరణం

author img

By

Published : Feb 19, 2021, 8:09 AM IST

Updated : Feb 19, 2021, 9:08 AM IST

jk
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- పోలీస్​ అధికారి వీరమరణం

08:07 February 19

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- పోలీస్​ అధికారి వీరమరణం

జమ్ము కశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలోని బడిగామ్​ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు ముష్కరులపై ఎన్​కౌంటర్ జరిపారు. సుదీర్ఘ కాలం జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. మృతులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  

బుద్గాం జిల్లాలోని జనిగామ్ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ పోలీస్​ అధికారి(ఎస్పీఓ) మృతి చెందగా.. మరో  పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రవాదులు ఉన్నట్లు సమచారం తెలుసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తుండగా.. ముష్కరులు వారిపై దాడి జరిపారు.    

ఇదీ చదవండి : పెళ్లి బస్సు బోల్తా.. ఇద్దరు మృతి

Last Updated :Feb 19, 2021, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.