హిందూ సంప్రదాయం ప్రకారం 30 జంటలకు వివాహం.. ముస్లిం నేత ఆదర్శం!

author img

By

Published : Dec 1, 2022, 11:15 AM IST

Updated : Dec 1, 2022, 11:35 AM IST

mass Marriage program in karnataka

ఓ ముస్లిం నేత హిందూ సంప్రదాయం ప్రకారం 30 జంటలకు వివాహం జరిపించారు. కర్ణాటకకు చెందిన ఆయన.. మత సామరస్యానికి ఉదాహరణగా నిలుస్తున్నారు.

హిందూ ముస్లిం భాయిభాయి అనేందుకు నిదర్శనంగా కర్ణాటకలోని ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఓ ముస్లిం నేత హిందూ ఆచారాల ప్రకారం 30 జంటలకు వివాహం జరిపించారు. వర్గాలకు అతీతంగా ఈ పెళ్లిళ్లు జరగడం విశేషం. హిందూ ఆచారాల ప్రకారం జరిపించిన ఈ పెళ్లి వేడుకలుకు వివిధ వర్గాలకు చెందిన జంటలు వేదిక మీదకు చేరి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

mass Marriage program  in karnataka
వివాహానికి హాజరైన జంటలు

కర్ణాటక కొప్పాల్​లోని ముస్లిం వర్గానికి చెందిన వాజిర్​ అలి హోనల్​ అనే వ్యక్తి.. ఆ ప్రాంతంలోని బన్నీ మహంకాళి ఆలయంలో బుధవారం హిందూ సాంప్రదాయాల ప్రకారం బుధవారం ఈ వివాహాలు జరిపించారు. మొత్తం 30 జంటలు ఈ సందర్భంగా ఒక్కటయ్యారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. గత కొన్నేళ్లుగా ఇదే ఆలయంలో కొన్ని వందల జంటలను ఒక్కటి చేసిన వాజిర్​.. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

mass Marriage program  in karnataka
వివాహానికి హాజరైన జంట
mass Marriage program  in karnataka
వాజిర్​ అలి హోనల్
Last Updated :Dec 1, 2022, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.