ETV Bharat / bharat

చెరువు దగ్గరకు పిలిచి.. బాలికపై గ్యాంగ్​ రేప్​.. ఆపై యాసిడ్​ పోసి..

author img

By

Published : Jun 16, 2022, 10:25 AM IST

gangrape
gangrape

బాలికను చెరువు దగ్గరకి పిలిచి అత్యాచారం చేశారు నలుగురు కామాంధులు. ఆ తర్వాత ఆమెపై యాసిడ్​ పోసి తగులబెట్టాలని ప్రయత్నించారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, ముంబయిలో 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు దివ్యాంగులను పోలీసులు అరెస్టు చేశారు.

Rape Acid Attack Incident: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు యువకులు కలిసి ఓ బాలికను చెరువు దగ్గరికి కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆపై యాసిడ్​ తగులబెట్టాలని చూశారు. అయితే బాధితురాలు తప్పించుకుని పారిపోయింది.
అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు అంతా పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆధారాలు సేకరించారు. ప్రధాన నిందితుడు డబ్బూ రాజ్‌భర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న మిగతా ముగ్గురిని అరెస్ట్​ చేశారు. బాధితురాలు.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

యువతిపై దివ్యాంగుల అత్యాచారం.. మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఓ 19 ఏళ్ల యువతికి మద్యం తాగించి ఆమె బంధువుతో పాటు నలుగురు దివ్యాంగులు అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్​ చేశారు.
ముంబయిలోని శివాజీనగర్​ ప్రాంతంలో ఉండే బాధితురాలు.. ఏప్రిల్​ నెలలో తన బంధువు ఇంటికి వెళ్లింది. అక్కడ అతడు ఆమెతో మద్యం తాగించాడు. ఆ తర్వాత బాధితురాలి బంధువుతోపాటు నలుగురు స్నేహితులు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో మహిళ గర్భం దాల్చింది. వెంటనే ఆమె తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్​ చేశారు. మరొకరికోసం గాలిస్తున్నారు. అందరూ అంగవైకల్యంతో బాధపడుతున్నవారేనని చెప్పారు.

ఇవీ చదవండి: రాహుల్​పై కొనసాగిన ఈడీ ప్రశ్నల వర్షం.. మళ్లీ రావాలంటూ సమన్లు

నాన్న కొడతాడనే భయంతో పెరట్లో దాక్కున్న చిన్నారి.. పాము కాటేసి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.