ETV Bharat / bharat

రాజస్థాన్​లో రోడ్డు ప్రమాదం- ఐదుగురు దుర్మరణం

author img

By

Published : Feb 22, 2021, 10:13 PM IST

రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

5 killed, 15 injured in road accident in Rajasthan
అంత్యక్రియలకు వెళ్తుండగా అనంతలోకాలకు..

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ట్రక్కును జీప్​ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

హర్యానా నుంచి సర్దార్‌షహర్ వైపు వెళ్తున్న జీపు.. భలేరి సమీపంలో ట్రక్కును ఢీకొందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారందరూ దగ్గరి బంధువు అంత్యక్రియలకు బయలుదేరి వెళ్తున్నారు.

మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: మాజీ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.