ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతం.. డ్రోన్లతో టిఫిన్​ బాక్సుల్లో బాంబులు

author img

By

Published : Jun 7, 2022, 8:53 AM IST

Updated : Jun 7, 2022, 12:50 PM IST

2 LeT militants, including 1 Pakistani, killed in encounter in J-K's Kupwara
2 LeT militants, including 1 Pakistani, killed in encounter in J-K's Kupwara

Kupwara Encounter: ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఇందులో ఓ పాకిస్థానీ టెర్రరిస్ట్​ కూడా ఉన్నాడు. మరోవైపు.. సరిహద్దు వద్ద డ్రోన్లతో జారవిడిచిన ఐఈడీలను టిఫిన్​ బాక్సుల్లో గుర్తించారు పోలీసులు.

Kupwara Encounter: జమ్ముకశ్మీర్​ కుప్వారాలో ఎన్​కౌంటర్​ జరిగింది. లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ముష్కరులను హతమార్చాయి భద్రతా దళాలు. ఇందులో ఓ పాకిస్థానీ ఉగ్రవాది కూడా ఉన్నట్లు జమ్ముకశ్మీర్​ పోలీసులు తెలిపారు. కుప్వారాలోని ఛక్తారాస్​ కాండీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ నిర్బంధ తనిఖీలు చేపట్టారు సిబ్బంది. ఈ క్రమంలోనే పోలీసులపైకి ముష్కరులు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు.. పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్​ ముష్కరుడిని తుఫేల్​గా గుర్తించినట్లు కశ్మీర్​ ఐజీ విజయ్​ కుమార్​ తెలిపారు. ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు వివరించారు. మరో వ్యక్తి ఇటీవలే ఉగ్రవాదంలోకి చేరాడని, అతడిని త్రాల్​కు చెందిన ఇష్తియాక్​ లోన్​గా గుర్తించారు. రెండు ఏకే-56 రైఫిల్స్​ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సోపోర్​లోని పానీపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లోనూ ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. అతడిని లాహోర్​కు చెందిన హంజాల్లాగా గుర్తించారు. ఏకే-47 రైఫిల్​, 5 మేగజైన్లను ముష్కరుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పాక్​ టెర్రరిస్టులు తప్పించుకున్నారని, వారి బ్యాగుల్లో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయని వెల్లడించారు ఐజీపీ తెలిపారు.

డ్రోన్​లో ఐఈడీల కలకలం: ముష్కరులు సరిహద్దుల్లో దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. డ్రోన్లద్వారా కశ్మీర్​లోకి పేలుడు పదార్థాలను అక్రమంగా సరఫరా చేస్తున్నారు. డ్రోన్​ జారవిడిచిన 3 మేగ్నటిక్​ ఐఈడీలను కంటోవాలా- దయారన్​ ప్రాంతంలో గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు.. జమ్మూలోని భారత్​- పాక్​ సరిహద్దులో ఆకాశంలో కొద్దిసేపు కాల్పులు జరిపారు బీఎస్​ఎఫ్​ జవాన్లు. ఓ శబ్దం రావడంతో డ్రోన్​ అనే అనుమానంతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం చేపట్టిన సోదాల్లో టిఫిన్​ బాక్సుల్లో టైమర్​ సెట్​ చేసి ఉంచిన ఐఈడీలను గుర్తించారు.

3 magnetic IEDs packed inside the children's tiffin boxes
టిఫిన్​ బాక్సుల్లో ఐఈడీలు

హిజ్బుల్​ కమాండర్​ హతం: హిజ్బుల్​ ముజాహిదీన్​ ముఠాకు చెందిన ఉగ్ర కమాండర్​ను కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేశారు పోలీసులు. అతడు రెండేళ్లుగా అక్కడే తలదాచుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్రీయ రైఫిల్స్​, సీఆర్​పీఎఫ్​ సంయుక్తంగా బెంగళూరు పోలీసులతో కలిసి తాలిబ్​ హుస్సేన్​ను అరెస్టు చేసినట్లు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​ మీడియాకు వెల్లడించారు. జూన్​ 3నే ఆపరేషన్​ జరిగినా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇవీ చూడండి: కర్ణాటకలో 'చెడ్డీ' వివాదం.. కాంగ్రెస్‌ కార్యాలయానికి నిక్కర్లు

'నుపుర్​' మాటలపై మంటలు.. ఇస్లామిక్ దేశాల భగ్గు

Last Updated :Jun 7, 2022, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.