ETV Bharat / bharat

కరోనా ఉగ్రరూపం: దేశంలో మరో 1,84,372 కేసులు

author img

By

Published : Apr 14, 2021, 9:45 AM IST

దేశంలో రెండో దశ కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,84,372 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 1,027 మంది ప్రాణాలు కోల్పోయారు.

covid-19
కరోనా ఉగ్రరూపం

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజువారి కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొత్తగా 1,84,372 మంది కొవిడ్​ బారినపడ్డారు. వైరస్​ ధాటికి మరో 1,027 మంది బలయ్యారు. కొవిడ్​ సోకిన వారిలో మరో 82,339 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,38,73,825
  • మొత్తం మరణాలు: 1,72,085
  • కోలుకున్న వారు: 1,23,36,036
  • యాక్టివ్​ కేసులు: 13,65,704

దేశంలో ఇప్పటివరకు మొత్తం 11 కోట్ల 11లక్షల 79వేల 578 డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి : భారీగా నాటు తుపాకుల పట్టివేత- 18 మంది అరెెస్ట్

'ప్రాథమిక దశలోనే జోక్యం వద్దు- విచారణ చేయనివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.