ETV Bharat / bharat

Sharad Pawar: పవార్​ నివాసంలో ప్రతిపక్షాల కీలక భేటీ

author img

By

Published : Jun 22, 2021, 4:17 PM IST

Updated : Jun 22, 2021, 6:00 PM IST

sharad pawar
శరద్ పవార్​ నివాసంలో ప్రతిపక్షాల కీలక భేటీ

దిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్​ పవార్(Sharad Pawar) నివాసంలో రాష్ట్ర మంచ్​(జాతీయ సమాఖ్య) సమావేశమైంది. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన 15మంది నాయకులు భేటీకి హాజరయ్యారు.

దిల్లీలోని శరద్ పవార్​(Sharad Pawar) నివాసంలో రాష్ట్ర మంచ్​(జాతీయ సమాఖ్య) భేటీ అయ్యింది. దేశంలోని వివిధ ప్రతిపక్షాలకు చెందిన 15మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, పవార్​ దీనికి నేతృత్వం వహిస్తున్నారు.

ఈ భేటీలో పాల్గొన్న వారిలో సమాజ్ వాదీ పార్టీ నేత ఘన్​శ్యామ్​ తివారీ, ఆర్​ఎల్​డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, ఆప్​ నాయకుడు సుశీల్​ గుప్తా, సీపీఐ ఎంపీ బినోయ్​ విశ్వం పాల్గొన్నారు. సీపీఎం నేత నీలోత్పాల్​ బసు ఉన్నారు.

opposition meet
యశ్వంత్ సిన్హా
opposition meet
జయంత్ చౌదరి
opposition meet
జావెద్ అక్తర్
opposition meet
పవార్​ నివాసంలో ప్రతిపక్షాల కీలక భేటీ

నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ మాజీ నేత సంజయ్ ఝా, జేడీయు మాజీ నేత పవన్ వర్మా కూడా సమావేశానికి హాజరయ్యారు. భేటీలో పాల్గొన్న ఇతర ప్రముఖుల్లో జస్టిస్​ ఏపీ షా, జావెద్ అక్తర్, కేసీ సింగ్ ఉన్నారు.

ప్రధాని మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్​ సిన్హా రాష్ట్ర మంచ్​ను 2018లో ఏర్పాటు చేశారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇది రాజకీయ వేదిక కాదు. దేశంలో రాజకీయ, సామాజిక ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. ఈ సమావేశానికి పవార్ తొలిసారి హాజరయ్యారు.

పవార్ కీలకం

కేంద్రంలో భాజపాకు వ్యతిరేక కూటమి ఏర్పాటులో పవారే కీలక నేతగా భావిస్తున్నారు. 2024 లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏకు దీటుగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. తన వ్యూహాలతో బంగాల్​లో టీఎంసీకి తిరుగులేని విజయాన్ని అందించిన ప్రశాంత్ కిశోర్​తో పవార్ రెండు సార్లు భేటీ అయిన తర్వాత రాష్ట్ర మంచ్ సమావేశం జరగుతుండటం ఆసక్తికరంగా మారింది.

ఎన్సీపీ భేటీ..

అంతకు ముందు పవార్​ నివాసంలోనే ఆయన అధ్యక్షతన ఎన్సీపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యచరణ, 2024 లోక్​సభ ఎన్నికల్లో తమ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాలపై రెండు గంటల పాటు చర్చించారు. ఈ భేటిలో ఎన్​సీపీ కీలక నేతలు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్​, సునీల్​ తత్కరే పాల్గొన్నారు.

Last Updated :Jun 22, 2021, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.