ETV Bharat / bharat

ఆస్పత్రిలో బ్రిటిష్ కాలం నాటి సొరంగ మార్గం.. ఎక్కడి వరకు ఉందో తెలుసా?

author img

By

Published : Nov 4, 2022, 10:46 PM IST

ముంబయిలోని జేజే ఆసుపత్రిలో బ్రిటిష్‌ కాలం నాటి పురాతన సొరంగం వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ సొరంగం బయటపడింది. 130 సంవత్సరాల క్రితం దీని నిర్మాణం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు.

British era tunnel uncovered
British era tunnel uncovered

మహారాష్ట్ర ముంబయిలోని జేజే​ ఆసుపత్రిలో బ్రిటిష్‌ కాలం నాటి పురాతన సొరంగం బయటపడింది. ఆసుపత్రి ప్రాంగణంలో అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో భూమి లోపల ఓ దారి కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. లోపలికి తవ్వి చూస్తే అది ఒక సొరంగంగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఇది సుమారుగా 200మీటర్ల పొడవు ఉన్నట్లు ఆస్పత్రి వైద్యుడు అరుణ్‌ రాథోడ్‌ వెల్లడించారు. ఈ సొరంగ మార్గం డెలివరీ వార్డు నుంచి చిల్లపిల్లల వార్డు వరకు ఉన్నట్లు గుర్తించారు.

దీన్ని 130 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా భావిస్తున్నారు. పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే 177 సంవత్సారాల క్రితం ఈ పురాతన అసుపత్రిని నిర్మించారు. సర్​ జమ్​షేడ్​జీ జిజిభాయ్​, సర్​ రాబర్ట్​ గ్రాంట్​ సహకారంతో దీని నిర్మాణం చేపట్టారు. ఆసుపత్రి వాస్తు కోసం సర్​ జమ్​షేడ్​జి జిజిభాయ్​ అప్పట్లోనే లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఇదివరకు ఎన్నో..
జేజేడీఎమ్​ ఆసుపత్రిలో ప్రాంగణంలో పురాతన సొరంగం ఒకటి వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇదేమి కొత్త విషయం కాదు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సొరంగ మార్గాలు, సబ్​వేలు బయటపడ్డాయి. కొన్ని సంవత్సరాల క్రితం సెయింట్​ జార్జ్​ ఏరియాలో ఒక సొరంగ మార్గం బయటపడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.