పోలీసుల మంచి మనసు.. అనారోగ్యంతో ఉన్న కొండముచ్చుకు ఓఆర్​ఎస్​

By

Published : Jul 26, 2022, 12:40 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​ హరిద్వార్​ పోలీసులు తమ మంచి మనసును చాటుకున్నారు. కావడి యాత్ర వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసుల వద్దకు ఓ కొండముచ్చు వచ్చింది. మొదట ఎందుకు వచ్చిందో తెలియని పోలీసులు తర్వాత కొండముచ్చు అనారోగ్యంతో ఉందని గ్రహించారు. వెంటనే జగ్వీర్​ రాణా అనే కానిస్టేబుల్ ఓఆర్​ఎస్ ద్రావణాన్ని వాటర్​ బాటిల్​తో కొండముచ్చుకు అందించి దాని దాహాన్ని తీర్చారు. పోలీసుల తీరు పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.