ప్రభుత్వానికి బుద్ది చెప్పడం కోసం టీడీపీతో కలిసి పనిచేస్తామంటున్న వైసీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 12:12 PM IST

thumbnail

YSRCP MPP Leaders Joined In TDP In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు టీడీపీలోకి చేరారు. ఇటీవలే ఏలేశ్వరం, రౌతులపూడి మండలాలకు చెందిన ఎంపీపీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడి టీడీపీను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులందరికీ సమాన గుర్తింపు ఉంటుందని సత్యప్రభ తెలిపారు. మనం అందరం పార్టీ కోసం కలసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహ మూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామ్య విధానాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పడం కోసం టీడీపీతో కలిసి పనిచేస్తామని నరసింహ మూర్తి అన్నారు. ఈ సమావేశానికి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.