VRAs Fired on YSRCP Govt: వీఆర్ఏలను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారు: సీఐటీయూ నాయకులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 7:45 PM IST

thumbnail

VRAs Fired On YSRCP Govt: వీఆర్ఏల సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ..సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రామ రెవెన్యూ సహాయకులు కలెక్టరేట్​ల వద్ద ధర్నాకు దిగారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే, అక్రమంగా అరెస్టులు చేసి, నిర్బంధం చేస్తారా..? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్​ఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ.. వీఆర్ఏల సమస్యల పరిష్కార విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 

సీఐటీయూ నాయకులు మీడియాతో మాట్లాడుతూ..''వీఆర్​ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 'చలో విజయవాడ' కార్యక్రమం చేపడితే.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్ఏల ఫైలుపైనే మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కి.. ఆ బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం స్పందించి తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీఆర్​ఏల సమస్యలను పరిష్కరించాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. తెలంగాణ మాదిరిగానే ఇక్కడ కూడా వీఆర్​ఏలకు పేస్కేల్ అమలు చేయాలి'' అని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.