Gold Thefts In Nizamabad : షాప్​కి వెళ్లొచ్చేసరికి.. 16 తులాల బంగారం, రూ.1.85 లక్షలు చోరీ

By

Published : Jun 3, 2023, 3:19 PM IST

Updated : Jun 3, 2023, 3:31 PM IST

thumbnail

Thieves Who Stole Gold And Cash : ఓ వ్యక్తి బ్యాంకులో డిపాజిట్​ చేయడానికి నగదు, బంగారాన్ని తీసుకొని వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి వాటిని ఎత్తుకుపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ చోరీలో 16 తులాల బంగారం, రూ.1.85 లక్షల నగదును దుండగులు అపహరించుకుపోయారు. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్​ పట్టణంలోని శంకర్​ నగర్​కు చెందిన సయ్యద్​ 16 తులాల బంగారం, రూ.1.85 లక్షల నగుదును తన బైక్​లో పెట్టుకొని బ్యాంకులో డిపాజిట్​ చేయడానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో ఓ షాపులో పని ఉండడంతో.. అక్కడికి వెళ్లాడు. అతనిని గమనించుకుంటూ ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఇదే అవకాశం అని భావించి.. బ్యాగ్​ను దొంగలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ చోరీ మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయింది. దాని ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.

Last Updated : Jun 3, 2023, 3:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.