ముడుపులు తీసుకోకుండానే టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారా? : లోకేశ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 12:30 PM IST

thumbnail

TDP Lokesh On Bhudati Laxminarayana: పొరుగు రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు.. వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడి పదవి ఎలా వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ నిలదీశారు. ముడుపులు అందుకోకుండానే బూదాటి లక్ష్మీనారాయణను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారా అని లోకేశ్​ ప్రశ్నించారు. కరకట్ట కమాల్.. ఇక డ్రామాలు కట్టిపెట్టాలంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అక్రమార్కులకు వైసీపీ ప్రభుత్వం పదవులు అంటకడుతోందని ఆయన విమర్శించారు.   

బూదాటి లక్ష్మీనారాయణ పలు ప్రీలాంచ్‌ ప్రాజెక్టుల పేరుతో గతంలో.. 2 వేల 500 మంది నుంచి 900 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ ప్రాజెక్టుల పేరుతో అందరినీ మోసం చేశారని ఆర్థిక నేరాల విభాగం అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను హైదరాబాద్​లో సీసీఎస్​ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలోనే టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.