మైలవరం సహజ సంపదను దోచుకుంది ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ - దేవినేని ఉమా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 1:34 PM IST

thumbnail

TDP Leader Devineni Uma Fires on MLA Krishna Prasad: బూడిద చెరువు సందర్శనకు టీడీపీ-జనసేన(TDP Janasena) నాయకులు వస్తామంటే  మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ తనపై దాడి చేయించారని టీడీపీ సీనియర్‌ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గడిచిన నాలుగున్నరేళ్లలో మైలవరం నియోజకవర్గంలో సహజ సంపద, బూడిద దోచుకుని బాగుపడింది కృష్ణ ప్రసాద్ ఆయన బావమరిది కోటేశ్వరరావేనని ఉమ మండిపడ్డారు. బూడిదతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బుధవారం టీడీపీ స్థానిక కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఉమా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌పై ధ్వజమెత్తారు.

MLA Krishna Prasad Looted Natural Wealth of Mylavaram: టీడీపీ నేతలు కృష్ణా జలాల హక్కులపై దిష్టి బొమ్మ తగలబెడితే మా మీద అక్కసుతో చంద్రబాబు, తమ బొమ్మలు వైసీపీ నేతలు తగలబెట్టించారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం నాగార్జున సాగర్ ప్రొజెక్టు(NSP) నీటిని విచ్చలవిడిగా వాడుతుంటే ఆంధ్ర రాష్ట్రానికి హక్కు ఉన్నా నియోజకవర్గానికి వైసీపీ ప్రభుత్వం చుక్కనీరు తేవడం లేదని మండిపడ్డారు. పంటలు కళ్లముందే ఎండిపోతున్నా కనీసం వెళ్లి పరిశీలించింది లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.