టీడీపీకి ఓట్లేశారని తాగునీరు బంద్​- సర్పంచ్​ నిర్ణయంపై మహిళల ఆందోళన - Women Protest for water Problem

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 5:05 PM IST

thumbnail
టీడీపీకి ఓట్లేశారని తాగునీరు బంద్​- సర్పంచ్​ నిర్ణయంపై మహిళల ఆందోళన (ETV Bharat)

Women Protest for Drinking Water in Ananthapur District: గుక్కెడు నీళ్ల కోసం అనంతపురం జిల్లా వాసులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బీటీ ప్రాజెక్టు గ్రామంలో తాగునీరు అందించాలంటూ మహిళలు ధర్నాకు దిగారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో 15 రోజులుగా తాగునీరు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు సరఫరా చేయాలంటూ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. తాగునీరు సరఫరా చేయాలని కోరితే చేయమని గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని మహిళలు వాపోయారు. 

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని గ్రామ సర్పంచ్ తాగునీరు రాకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. సంబంధిత ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గుమ్మగట్ట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో సమస్య ఉంటే పరిష్కరించాల్సిన సర్పంచే ప్రజలకు నీటిని అందించకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.