Lokesh on Farmers Problems ఏపీలో తగ్గిన సాగుపై లోకేశ్ ఆందోళన.. రైతు సమస్యలపై ఒత్తిడి పెంచాలి.. స్ట్రాటజీ కమిటీ నేతలకు సూచన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 5:18 PM IST

thumbnail

Nara Lokesh on Farmers Problems: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షభావంతో నీరందక 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని, రైతు సమస్యలకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం పార్టీ నేతలకు.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సాగునీటి కష్టాలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని లోకేశ్ ఆవేదన చెందారు. 

Nara Lokesh Comments: టీడీపీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పార్టీ నేతలు.. జిల్లాల వారీగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి, రైతుల దీన స్థితిని నారా లోకేశ్‌కు వివరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..''రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. దానికితోడు సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం స్పందించడం లేదు. సబ్సిడీల నిలిపివేత, పెరిగిన సాగు ఖర్చులతో సతమతమవుతున్న అన్నదాతలపై కరవు పరిస్థితుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.