CPI Ramakrishna: ప్రభుత్వం, పోలీసులు.. ఇప్పటికైనా కళ్లు తెరవాలి: సీపీఐ రామకృష్ణ

By

Published : May 12, 2023, 6:05 PM IST

thumbnail

ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ వన్​ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో  ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. జగన్​ ప్రభుత్వం రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కేందుకు జీవో1 తీసుకొచ్చిందని.. ఆ జీవోను కొట్టేయాలని కోరుతూ సీపీఐ నేత రామకృష్ణతో పాటుగా పలు పార్టీల నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నేడు తీర్పును వెలువరించింది. ఈ జీవో నంబర్‌ ఒకటిని కొట్టేస్తూ ఇచ్చిన తీర్పు పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. చిన్న ఉద్యమం చేసినా ఈ ప్రభుత్వం సహించలేక పోతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం, పోలీసులు.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉందని అన్నారు. కోర్టు తీర్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందనను మా ప్రతినిధి జయప్రకాశ్‌ అందిస్తారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.