పట్టపగలే దోపిడీ.. బైక్​ల​పై వెంబడించి, తుపాకులతో బెదిరించి..

By

Published : Jun 26, 2023, 12:34 PM IST

Updated : Jun 26, 2023, 2:07 PM IST

thumbnail

Delhi Robbery : దిల్లీలోని ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ వద్ద పట్టపగలే దోపిడీ జరిగింది. కారులో వెళ్తున్న బంగారు ఆభరణాల వ్యాపారి, అతడి సహచరుడిని ఆపిన దొంగలు వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయలను నగదును దోచుకెళ్లారు. రెండు బైకులతో వెంబడించి.. రోడ్డుపై వెళ్తున్న కారును అడ్డగించి తుపాకులు చూపించి నగదు బ్యాగును ఎత్తుకెళ్లారు. ఈ నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడ్ని సంజన్ కుమార్​గా పోలీసులు గుర్తించారు. అతడు గుజరాత్​లోని మెహసానా ప్రాంతానికి చెందిన వ్యక్తి. దిల్లీలోని చాందినీ చౌక్ ఏరియాలో ఇతడికి నగల దుకాణం ఉంది. ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు, తన సహచరుడైన జితేంద్ర పటేల్​తో కలిసి క్యాబ్​లో గురుగ్రామ్​లో వెళుతున్నాడు. మొదటి నుంచే కారును అనుసరిస్తున్న వస్తున్న దొంగలు.. దారిలో ఈ ఘటనకు పాల్పడ్డారు.

గవర్నర్​ రాజీనామా చేయాలని కేజ్రీవాల్​ డిమాండ్​..
ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ తీవ్రంగా స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ అందించేవారికి మార్గం సుగమం చేయాలన్నారు. "దిల్లీని పూర్తి సురక్షిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం మార్చలేకపోతోంది. లా అండ్​ ఆర్డర్​ను మాకు అప్పగించండి. దిల్లీ ప్రజలకు మేము భద్రత కల్పిస్తాం" అని కేజ్రీవాల్ ట్వీట్​ చేశారు.

Last Updated : Jun 26, 2023, 2:07 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.