CPI Ramakrishna Fires on CM Jagan: 'నీటి పారుదల ప్రాజెక్టులను జగన్ గాలికొదిలేశారు.. కృష్ణా జలాల్లో వాటాలు తాకట్టు' : సీపీఐ రామకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 1:53 PM IST

thumbnail

CPI Ramakrishna Fires on CM Jagan: కృష్ణా జలాల అంశంపై కేంద్ర కేబినెట్ పునఃపంపిణీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం దిల్లీలోనే ఉన్నారని.. అయినా కూడా అడ్డుకోవడంలో విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియాతో రామకృష్ణ మాట్లాడారు. కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో కిషన్‌రెడ్డి సదస్సు పెడుతున్నారని తెలిపారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ గెజిట్ ఇచ్చారని రామకృష్ణ పేర్కొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సీఎం జగన్ గాలికొదిలేశారని విమర్శించారు. ఈనెల 18న నీటి ప్రాజెక్టులపై కడపలో రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు. 

CPI Ramakrishna on Chandrababu Health: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని.. రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన నిర్లక్ష్యంగా మాట్లాడకూడదని హితవు పలికారు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదంటే ఎగతాళిగా మాట్లాడతారా అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు సమాధానం చెప్పాలిగానీ.. డీఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడతారని రామకృష్ణ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.