నీళ్లు కావాలని నిద్రలేపారు - కళ్లెదుటే చిన్నారిని ఎత్తుకుని పారిపోయారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 2:44 PM IST

thumbnail

Child was Kidnapped by Unknown Persons : ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో కొప్పుల ఫ్లై ఓవర్ బ్రిడ్ది వద్ద 10 నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. చిన్నారి నిరీక్షణ తల్లిదండ్రులు గత కొంత కాలంగా పొలాల్లో బాతులు పెంచుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం రాత్రి (నవంబరు 26న ) 11 గంటలకు సమయంలో.. గుర్తు తెలియని ఓ మహిళ, పురుషుడు స్కూటీ పై వచ్చి.. నీళ్లు కావాలని చిన్నారి తల్లిని నిద్ర లేపారు. 

తాను నీళ్లు తెచ్చేలోపే నిద్రిస్తున్న తన కుమారైను ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయం గమనించిన వారు.. వెంటనే అప్రమత్తమై.. స్కూటీ వెంట పరిగెత్తి పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోజూ ఇంటి వద్ద ఆడుకునే తన చిన్నారి నిరీక్షణ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పుట్టెడు శోకంలో మునిగిపోయారు. తన చిన్నారి ఆచూకీ తొందరగా తెలియజేయాయని పోలీసులను వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.