వరదలో కారులో కొట్టుకుపోయిన వ్యక్తి - నాలుగు గంటల ఉత్కంఠకు తెర, క్షేమంగా ఒడ్డుకుచేర్చిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 5:03 PM IST

thumbnail

Car Stuck in Floods in Prakasam District : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం హనుమపురం సమీపంలో కొండ వాగు ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. గోగినేని హనుమంతరావు అనే వ్యక్తి  కారులో చిక్కుకున్నట్లు స్థానికులు గుర్తించారు. ఒమ్మివరం నుంచి నాగులుప్పలపాడు వైపు వెళ్తండగా.. హనుమాపురం గ్రామం వచ్చేసరికి.. కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతిని సరిగా అంచనా వేయకుండా ఆయన కారులోనే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు దాటే ప్రయత్నం చేశారు.

కానీ, గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిని గమనించ కుండా అలాగే ముందుకు వెళ్లటంతో కారు ఒక్క సారిగా వాగులోకి కొట్టుకుపోయింది. రోడ్డు నుంచి సుమారు 500 మీటర్ల దూరం వరకు కొట్టుకుపోయి.. వాగు మధ్యలో ఉన్న చెట్టు కొమ్మల మధ్యలో ఇరుక్కుపోయింది. కారు నుంచి హనుమంతరావు బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. స్థానికులు ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీసి హనుమంతరావును కాపాడారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.