నేను అలా అనలేదు- నా మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు: బాలినేని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 10:23 PM IST

thumbnail

Balineni Srinivas Reddy Comments: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందని, తన స్నేహితుడితో పందెం కాసినట్లు తానే చెప్పానని, ఆ తరువాత మరలా ఆ పందెం విరమించుకున్నానని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు వచ్చిన పట్టణ ఓటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్సార్సీపీ వస్తుందనే భావనతో తాను అలా మాట్లాడితే, కొందరు ఆ మాటలను వక్రీకరించారని పేర్కొన్నారు. 

Balineni Fire on TDP: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తాను రూ.50 లక్షల పందెం కాశానంటూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే, కొందరు తన మాటలను వక్రీకరించి తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ బాలినేని బెట్టింగ్‌ ఆరోపణలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''తెలంగాణలో కాంగ్రెస్‌ మా వల్లే గెలిచిందని టీడీపీకి ప్రచారం చేసుకుంది. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుస‌్తుందని మా స్నేహితుడితో పందెం కాసినట్లు నేనే చెప్పాను. ఆ తరువాత మరలా నేనే పందెం విరమించుకున్నానని కూడా చెప్పాను. బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓటింగ్‌ను దృష్టిలో పెట్టుకునే మా రాష్ట్రంలో కూడా వైసీపీ వస్తుందనే భావనతోనే నేను అలా మాట్లాడాను. కానీ, కొందరు నా మాటలను వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు.'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.