పేదవాళ్లకి అన్నం పెట్టడానికి మళ్లీ అన్న క్యాంటీన్ పునరుద్ధరిస్తాం-అయ్యన్న పాత్రుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 8:13 AM IST

Updated : Nov 22, 2023, 9:12 AM IST

thumbnail

Ayyanna Says Reopen Annaa Canteen Poor People In TDP Government: పేదవాడి నోటి వద్ద కూడు తీసేసిన జగన్​కు వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి కట్టాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 111 రోజులు అయిన సందర్భంగా మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి పేదవాళ్లకు అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..పేదవాడికి అన్నం పెట్టడానికి అన్నఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఈ చేతకాని జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూసివేసారన్నారు. కొన్నింటిని పడగొట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా 95 నియోజకవర్గాల్లో సొంత మొత్తం వెచ్చించి అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే  అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, విశాఖ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సత్యనారాయణ పాల్గొన్నారు.

Last Updated : Nov 22, 2023, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.