ఉచిత బస్సు ప్రయాణ పథకం వద్దు - కర్నూలులో ఆటో డ్రైవర్ల ధర్నా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 4:18 PM IST

thumbnail

Auto Drivers Protest in Kurnool Against Free Bus Service For Women In Andhra Pradesh : తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆంధ్రప్రదేశ్​లో అమలు చేయకూడదని ఆటో డ్రైవర్లు కర్నూలులో ధర్నా చేపట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతారని వారు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక చదువుకున్న యువత పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 

డిగ్రీ పాసైన వారు సైతం ఆటో కార్మికులుగా మారి జీవనోపాధి పొందుతున్నారని ఆటో డ్రైవర్లు తెలిపారు. ఉచిత బస్సు పథకం అమలు చేస్తే చాలా మంది జీవనోపాధి కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఓట్లు వేస్తారని రాజకీయ పార్టీలు అనుకోవడం పొరపాటని వారు తెలిపారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయకూడదని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.