మత్స్యకారుడికి చిక్కిన ప్రమాదకరమైన నాలుగు కళ్ల టైగర్​ ఫిష్ ​​

By

Published : Jan 15, 2023, 2:03 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

ఛత్తీస్​గఢ్​లోని గరియబండ్ జిల్లాలో మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది. నదిలో చేపలు పడుతున్న జాలర్లకు నాలుగు కళ్లున్న టైగర్​ ఫిష్​ చిక్కింది. పంటోరాలోని చిఖాలీ గ్రామానికి చెందిన నావల్ సింగ్ అనే వ్యక్తికి ఈ అరుదైన చేప దొరికింది. మొదట చేపను ఇంటికి తీసకుకెళ్లిన అతడు.. దాన్ని కోసేందుకు ప్రయత్నం చేశాడు. చేప వింతగా ఉన్న కారణంగా నిశితంగా పరిశీలించాడు. చేపకు నాలుగు ఉండటం గమనించాడు. దీంతో విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశాడు. అనంతరం ఆ చేపను టైగర్​ ఫిష్​గా గుర్తించారు. వింతగా ఉన్న చేపను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. నిపుణులు ఈ చేపను ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు.  

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.