ఒకేసారి 10 లక్షల మంది యోగా..​ గిన్నిస్​ బుక్ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు

By

Published : Jan 15, 2023, 7:32 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

ప్రపంచంలోనే అతిపెద్ద యోగాథాన్​తో అంతర్జాతీయ రికార్డులపై గురిపెట్టింది కర్ణాటక ప్రభుత్వం. ఆదివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో రాష్ట్ర ​గవర్నర్​ థావర్​ చంద్​ గహ్లోత్​ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గవర్నర్​తో పాటుగా 15,000 మంది విద్యార్థులు ఒకేసారి యోగా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 35 చోట్ల ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం కలిపి దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులు, వివిధ రంగాల వారు పాల్గొని ఉంటారని అధికారులు అంచనా వేశారు. జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా.. కేంద్ర ఆయుష్, సాంస్కృతిక శాఖలు ఈ యోగాథాన్​ను ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమం గిన్నిస్​ వరల్డ్ బుక్ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంటున్నందున.. యోగాథాన్​లో పాల్గొన్న అందరికీ గవర్నర్​ శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.