లిఫ్ట్​లో బాలుడిని కరిచిన కుక్క అమ్మతో స్కూల్​కు వెళ్తుండగా

By

Published : Nov 17, 2022, 9:00 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో ఆరేళ్ల బాలుడిని పెంపుడు కుక్క కరిచింది. లిఫ్ట్​లో బాలుడు తన తల్లితో స్కూల్​కు వెళ్తుండగా మంగళవారం జరిగిందీ ఘటన. బాలుడిని కుక్క కరిచినప్పుడు శునకం యజమాని కార్తీక్​ గాంధీ అక్కడే ఉన్నాడు. బాలుడి చేతికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయని అతడి తల్లి తెలిపింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఘటానాదృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. బాలుడిపై కుక్క దాడిచేసినందుకు గ్రేటర్ నోయిడా అధికారులు శునకం యజమాని కార్తీక్​కి పది వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ జరిమానాను ఏడు రోజుల్లోగా గ్రేటర్ నోయిడా అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. నోయిడా పరిధిలో కుక్కల దాడులు పెరడం వల్ల జంతు సంరక్షణ చట్టంలో ఇటీవల మార్పులు చేశారు. ఈ చట్టం ప్రకారం తాజాగా జరిమానా విధించారు.

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.