ETV Bharat / state

డివైడర్​ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. మహిళ మృతి

author img

By

Published : May 21, 2021, 9:15 AM IST

కడప నగరంలోని వై-కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు.

woman died in a road accident at kadapa
కడపలో రోడ్డు ప్రమాదం

కడప నగరంలోని ఉక్కాయపల్లి ప్రాంతానికి చెందిన సుధారాణి, శ్రీకాంత్​లు వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై కడపకు వచ్చారు. పనులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా.. వై-కూడలి వద్ద డివైడర్​ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో సుధారాణి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీకాంత్​కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం శ్రీకాంత్​ను కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రేపు హైకోర్టులో తీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.