ETV Bharat / state

9PM TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM

author img

By

Published : Oct 28, 2022, 9:01 PM IST

ఏపీ ప్రధాన వార్తలు
9PM TOP NEWS

.

  • పోలీసు వలయంలో విశాఖ... తెదేపా నేతల అరెస్టులు... గృహనిర్బంధాలు
    ఉత్తరాంధ్ర సమస్యలపై తెలుగుదేశం తలపెట్టిన పోరుబాట ఉద్రిక్తతలకు దారితీసింది. విశాఖ రుషికొండ అక్రమాలపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కీలక నేతలు బయటకు రాకుండా.. గృహ నిర్భంధం చేశారు. విశాఖను పోలీసుల వలయంగా మార్చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలు.. ఆ కార్డుల్లో హెల్త్​ హిస్టరీ
    ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరో 809 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఈ కార్డుల్లో ప్రతి ఒక్కరి హెల్త్‌ హిస్టరీ పొందుపరచాలని సీఎం ఆదేశించారు. నిరంతరం రికార్డులు అప్‌డేట్ చేయాలన్నారు. వైద్యఆరోగ్యశాఖలో ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓఎంసీ కేసులో కీలక అడుగు.. నిందితులపై సీబీఐ కోర్టు అభియోగాలు
    ఓబుళాపురం గనుల కేసులో నిందితులపై నాంపల్లి సీబీఐ అభియోగాలు ఖరారు చేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్​రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాల నమోదయ్యాయి. విశ్రాంత అధికారులు కృపానందం, రాజగోపాల్‌, ఓఎంసీ, గాలి జనార్దన్​రెడ్డి పీఏ అలీఖాన్‌పైన సైతం అభియోగాలు నమోదయ్యాయి. హైకోర్టు స్టే వల్ల ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు అభియోగాలు ఖరారు చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గ్రామ సచివాలయ పనుల్లో విద్యుదాఘాతం.. ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థి మృతి
    కోనసీమ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఉచితాలను నియంత్రించే అధికారం ఈసీకి లేదు'.. ఎన్నికల్లో వాగ్దానాలపై కాంగ్రెస్
    ప్రస్తుతం దేశంలోని అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలు ఎరగా వేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయ పడి.. ఎన్నికల వాగ్దానాలకు అయ్యే వాస్తవ ఖర్చు ఓటర్లకు వెల్లడించాలని లేఖ రాసింది. దీనిపై భాజపా స్పందించగా.. తాజాగా కాంగ్రెస్​ పార్టీకూడా స్పందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లారీ, కారు ఢీ.. ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఐదుగురు మృతి
    జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఓ లారీ, కారు ఢీకొని ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు. మరో ఘటనలో ఓ కారు అదుపుతప్పి 70 అడుగుల లోతున్న బావిలో పడి.. మామ, మేనల్లుడు అక్కడికక్కడే మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కర్బన ఉద్గారాల కట్టడిలో భారత్‌ భేష్‌.. ఐరాస నివేదిక
    పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ధనిక దేశాలు చెబుతున్న మాటలకు వాటి ఆచరణకు ఏ మాత్రం పొంతనలేదని మరోసారి రుజువైంది. కర్బన ఉద్గారాల విడుదల ధనిక దేశాల్లోనే అధికంగా ఉంటోందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ నివేదిక నివేదిక స్పష్టం చేసింది. జీ20 దేశాల సగటులోనూ భారత్‌లో కర్బన ఉద్గారాల విడుదల సగమేనని ఐరాస నివేదిక పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మస్క్​ చేతికి ట్విట్టర్​.. భారత ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
    ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. యజమానులతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమ సంస్థలు అనుసరించాల్సిన నిబంధనలు, చట్టాలు అలాగే కొనసాగుతాయని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అలా జరిగి ఉంటే రిటైర్మెంట్​ ప్రకటించేవాడిని: అశ్విన్​
    టీమ్​ఇండియా క్రికెటర్​ అశ్విన్​ పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అలా జరిగి ఉంటే రిటైర్మెంట్ ప్రకటించి ఉండేవాడిని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బింబిసార్ 2 అప్డేట్​.. షూటింగ్​ షురూ అయ్యేది అప్పుడే
    నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బింబిసార' ఇటీవలే విడుదలై సూపర్​ హిట్ టాక్​ను దక్కించుకుంది. అయితే తాజాగా ఈ చిత్ర సీక్వెల్​పై అప్డేట్​ ఇచ్చారు వశిష్ట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.