ETV Bharat / state

గ్రామ సచివాలయ పనుల్లో విద్యుదాఘాతం.. ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థి మృతి

author img

By

Published : Oct 28, 2022, 4:42 PM IST

Updated : Oct 28, 2022, 5:44 PM IST

Electric shock: కోనసీమ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే..?

electric shock
విద్యుదాఘాతంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు

Electric shock: కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికుర్రులో విషాదం చోటు చేసుకుంది. జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యుదాఘాతంతో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ విద్యార్థి మృతి చెందాడు. తీవ్రగాయాలైన వివేక్‌, సతీశ్‌ ఆమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరు విద్యార్థులు నిఖిల్, మహిధర్​కు స్వల్పగాయాలయ్యాయి. పాఠశాల పక్కన గ్రామ సచివాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఇనుప ఊచలను మిషన్​తో కోస్తుండగా విద్యుత్ సరఫరా అయింది. మంచినీరు తాగేందుకు వచ్చిన విద్యార్థులు ఊచలు పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

అస్పత్రికి తరలిస్తుండగా నవీన్ అనే ఏడేళ్ల బాలుడు మార్గమధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరో మరో ఇద్దరు కోలుకుంటున్నారని తెలిపారు. మృతుడు నవీన్ తల్లి ఉపాధి కోసం గల్ఫ్​కు వెళ్లగా... ముగ్గురు అక్కలతో కలిసి ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 28, 2022, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.