ETV Bharat / state

'వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తే అడ్డుకుంటాం'

author img

By

Published : Oct 28, 2020, 9:29 PM IST

PCC President Shailajanath on meters to agriculture motors
పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌

వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడాన్ని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌ వ్యతిరేకించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం జగన్ రద్దు చేసే యోచనలో ఉన్నారని ఆరోపించారు.

రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేయకుండా మీటర్లు బిగిస్తే కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటుందని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌ కర్నూలులో అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ భావాలతో రైతులకు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తే.. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేసే విధంగా అడుగులు వేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడంతో ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం జగన్ భాజపాకు తొత్తుగా మారుతున్నారని శైలజానాథ్ విమర్శించారు.

ఇదీ చదవండి:

పెర్​ఫ్యూమ్​ గన్... పేలిస్తే కోతులు రన్​...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.