ETV Bharat / state

'రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయండి'

author img

By

Published : Oct 22, 2019, 4:31 PM IST

Updated : Oct 22, 2019, 5:43 PM IST

రాయలసీమలో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేయాలని న్యాయవాదుల రాస్తారోకో

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాద, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి.

రాయలసీమలో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేయాలని న్యాయవాదుల రాస్తారోకో

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాద, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. న్యాయవాదులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్​ - బెంగళూరు జాతీయ రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రాయలసీమలో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేసేంతవరకూ పోరాటం సాగిస్తామని నంద్యాల బార్​ అసోసియేషన్​ సంఘ అధ్యక్షుడు నాగరాజు అన్నారు.

ఇదీ చదవండి:సీఎంను కలిశాకే వెళ్తాం.. న్యాయవాదుల ఆందోళన!

Intro:ap_knl_21_22_rastaroko_nyayavadulu_ab_AP10058
యాంకర్, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాదుల సంఘము రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాయలసీమ హైకోర్టు ఏర్పాటు హక్కు అని.. బిక్ష కాదని వారు తెలిపారు. హైకోర్టు ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నంద్యాల బార్ అసోసియేషన్ సంఘము అధ్యక్షుడు నాగరాజు అన్నారు


Body:జాతీయ రహదారిపై న్యాయవాదుల సంఘము రాస్తారోకో


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated :Oct 22, 2019, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.