కృష్ణా జిల్లా బాపులపాడు మండలం దంటగుంట్లలో నమోదైన వృద్ధురాలిపై హత్యాయత్నం కేసును హనుమాన్ జంక్షన్ పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. చోరీతో పాటు హత్యాయత్నం చేసిన నిందితుడు హరీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన రూ.4 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన హనుమాన్ జంక్షన్ పోలీసులను ఎస్పీ అభినందించారు.
వృద్ధురాలిపై హత్యాయత్నం.. నిందితుడు అరెస్ట్
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం దంటగుంట్లలో నమోదైన వృద్ధురాలిపై హత్యాయత్నం కేసును హనుమాన్ జంక్షన్ పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. చోరీతో పాటు హత్యాయత్నం చేసిన నిందితుడు హరీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన రూ.4 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన హనుమాన్ జంక్షన్ పోలీసులను ఎస్పీ అభినందించారు.