గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడులో అక్రమంగా తరలిస్తున్న నాటు సారా ప్యాకెట్లు, మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు ఎస్సై బాల నాగిరెడ్డి తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి 8 లీటర్ల నాటుసారా ప్యాకెట్లు, 75 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరైన అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్సై హెచ్చరించారు.
అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్..
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడులో అక్రమంగా తరలిస్తున్న నాటు సారా ప్యాకెట్లు, మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు ఎస్సై బాల నాగిరెడ్డి తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి 8 లీటర్ల నాటుసారా ప్యాకెట్లు, 75 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరైన అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్సై హెచ్చరించారు.