ETV Bharat / state

కారు, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి

author img

By

Published : May 1, 2021, 9:35 PM IST

man-death-in-a-road-accident-at-narakoduru-guntur-district
కారు, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీ కొన్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

గుంటూరు నగరానికి చెందిన షేక్ సలాం... తన ద్విచక్రవాహనంపై నారాకోడూరు మీదుగా గుంటూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు నుంచి నారాకోడూరు వైపు వస్తున్న కారు షేక్ సలాం ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సలాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

యజమాని నమ్మకమే దొంగతనానికి పెట్టుబడి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.