ETV Bharat / state

GANG RAPE: భర్తనుకొట్టి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం!

author img

By

Published : Sep 9, 2021, 7:44 AM IST

Updated : Sep 9, 2021, 5:36 PM IST

gang rape
gang rape

07:38 September 09

మహిళపై సామూహిక అత్యాచారం

మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అచ్చం సినిమాని తలపించేలా జరిగిన ఓ ఘటన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగింది. నలుగురు వ్యక్తులు పక్కా ప్లాన్ చేసి ఓ మహిళపై దారుణంగా అత్యాచారం చేశారు. భర్తతో కలిసి బైక్ పై వెళుతున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. భర్తను అతిదారుణంగా కొట్టి కాళ్లూ చేతుల కట్టేసి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి కొడవళ్లు చూపించి బెదిరించి అత్యాచారం చేశారు. మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

అసలేం జరిగిందంటే..

మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు సంబంధించి గుంటూరు జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. మేడికొండూరు మండలం పరిధిలో మహిళపై సామాహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లికి చెందిన మహిళ మేడికొండూరు మండలం పాలడుగులోని బంధువుల ఇంట్లో జరిగిన వేడుకకు వెళ్లింది. తన భర్తతో కలిసి సత్తెనపల్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పాలడుగు అడ్డరోడ్డులో వెళ్తుండగా రోడ్డుపై చెట్టు పడి ఉంది. చెట్టు పక్కగా వెళ్తుండగా బైక్​కి కట్ట అడ్డుపెట్టారు. దీంతో దంపతులిద్దరూ కింద పడ్డారు.రాత్రి 9.45 గంటల సమయంలో మార్గమధ్యలో వారిని దుండగులు అడ్డుకున్నారు. 

గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. కొడవళ్లు చూపించి బెదిరించారు. చేతులతో చితకబాదారు. బట్టలు విప్పి భర్త చేతులు కాళ్లు కట్టేశారు. మహిళను పక్కకు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశారు. మహిళ మెడలో ఉన్న మంగళ సూత్రం, బంగారు ఉంగరం, కాళ్ల పట్టీలు తీసుకున్నారు. కొడవళ్లు చూపిస్తూ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు.  దీనిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు. తమ పరిధిలోకి రాదని అన్నారు.

దీంతో ఇవాళ ఉదయం మేడికొండూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకుని ఐపీసి సెక్షన్ 376డి, 394, 342 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరిక్షలు నిర్వహించి అనంతరం చికిత్స అందిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఘటనా స్థలాన్ని గుంటూరు డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ కేసు నమోదు చేయకపోవటాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఫిర్యాదు తీసుకుని జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకుండా తమ పరిధి కాదని తప్పించుకున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే సామూహిక అత్యాచారానికి సంబంధించి పోలీసులు సకాలంలోనే స్పందించారని సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి చెబుతున్నారు. బాధితులు సత్తెనపల్లి స్టేషన్ కు రాగానే వారి నుంచి వివరాలు తీసుకుని మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అలాగే రెండు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లటంతో పాటు నిందితుల కోసం గాలించినట్లు వివరించారు.

అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పాలడుగు సమీపంలో శీతల గోదాము నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలను విచారించారు. వారంతా ఒడిశా, విజయనగరం ప్రాంతాల నుంచి వచ్చినవారు. వారికి ఈ ఘటనతో ఏమైనా సంబంధం ఉందా లేక ఘటన జరిగిన తర్వాత నిందితులు అటుగా వచ్చారా అనే కోణంలో విచారించారు.

ఈ ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

జగన్ పాలనలో ఏపీ అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరం. బైక్‌పై వెళ్తున్న జంటపై దాడిచేసి అత్యాచారానికి పాల్పడటం అమానుషం. ఫిర్యాదు కోసం వెళ్తే తమ పరిధి కాదని పోలీసులు చెప్పడం దారుణం. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. పరామర్శకు వెళ్తుంటే వేలమంది పోలీసులను రంగంలోకి దింపారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు జగన్‌ వాడుకోవడం వల్లే ఈ దుస్థితి. - నారా లోకేశ్‌

ఇదీ చదవండి: current bill: విద్యుత్తు ఛార్జీల మోత.. అన్ని కేటగిరీల్లోనూ..

Last Updated :Sep 9, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.