గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద వీకర్స్ సొసైటీ ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇచ్చిన భూములను మైనింగ్ పేరుతో కాజేసేందుకు చూస్తున్న వారిని వదిలిపెట్టబోమని కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ హెచ్చరించారు. ఇవాళ యడవల్లి భూముల వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీని సీఐ సుబ్బారావు.. సిబ్బందితో అడ్డుకున్నారు. సమస్యను పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ దృష్టికి తీసుకెళ్లి పోరాటం కొనసాగిస్తామని వినయ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: Chandra Babu: పానకాల రెడ్డి మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి