ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇద్దరికి గాయాలు

author img

By

Published : Apr 8, 2021, 1:59 PM IST

injured people
దాడిలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెంలో కమ్మ మల్లిఖార్జునరావు, నెప్పలి సాంబయ్య వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో వివాదం చెలరేగి.. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సాంబయ్య, ప్రకాశ్​ అనే వ్యక్తుల తలలకు గాయాలయ్యాయి. రక్తంతో చొక్కాలు తడిసిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు. క్షతగాత్రులను బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.