ETV Bharat / state

అంతర్వేదిలో పోటెత్తిన సముద్రం..ఇళ్లలోకి చేరిన నీరు

author img

By

Published : Nov 5, 2021, 10:38 AM IST

సముద్ర పోటు
సముద్ర పోటు

తూర్పుగోదావరి జిల్లా(east godavari district) అంతర్వేది పల్లిపాలెం గ్రామం సముద్ర పోటుకు గురైంది. గ్రామంలోని ఇళ్లు, పాఠశాల ఆవరణలోకి వరద నీరు(Flood water) ప్రవేశించింది.

అంతర్వేదికి సముద్ర పోటు

తూర్పుగోదావరి జిల్లా(east godavari district) సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం గ్రామం సముద్ర పోటుకు గురి అయింది. అమావాస్య కావడంతో సాగర సంగమం వద్ద సముద్రపు కెరటాలు ఎగసిపడి గోదావరిలోకి చేరడంతో.. చెంతనే ఉన్న పల్లిపాలెం గ్రామంలోకి వరద నీరు(Flood water) ప్రవేశించింది. గ్రామంలోని ఇళ్లు, పాఠశాలలోకి భారీగా నీరు చేరింది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సముద్రపు పోటు నీరు గ్రామంలోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి

Boating: 7 నుంచి నదుల్లో బోటు షికారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.