ETV Bharat / state

Municipal Elections: అక్రమాలకు పాల్పడటంలో వైకాపా రికార్డు సాధించింది: తెదేపా నేతలు

author img

By

Published : Nov 15, 2021, 8:23 PM IST

అక్రమాలకు పాల్పడటంలో వైకాపా రికార్డు సాధించింది
అక్రమాలకు పాల్పడటంలో వైకాపా రికార్డు సాధించింది

అక్రమాలకు పాల్పడటంలో వైకాపా రికార్డు సాధించిందని తెదేపా నేతలు మండిపడ్డారు. పురపాలిక ఎన్నికల్లో ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా..కుప్పంలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత అమర్నాథ్ రెడ్డి అన్నారు. కుప్పం మున్సిపాలిటీలో గెలుపుకోసం అధికార పార్టీ నేతలు రూ.100 కోట్లు పంచారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

అక్రమాలకు పాల్పడటంలో వైకాపా రికార్డు సాధించిందని తెదేపా నేత అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. పాలనపై నమ్మకం లేకనే వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వైకాపా నేతలు ఓటుకు రూ. 10 నుంచి 15 వేలు పంచారని ఆరోపించారు. చివరకు అంబులెన్స్‌లోనూ ఓటర్లను తరలించారన్నారు. బ్యాలెట్‌ పెట్టెలు మార్చేందుకు యత్నించారన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. కుప్పంలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పతనం కుప్పం నుంచే ప్రారంభమైందన్నారు.

రూ.100 కోట్లు పంచారు: నిమ్మల

కుప్పం మున్సిపాలిటీలో అధికార పార్టీ నేతలు రూ.100 కోట్లు పంచారని తెదేపా నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..పోటీ చేసిన తన పార్టీ అభ్యర్థులను, ఏజంట్లను అరెస్టు చేయటం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని..,లేకపోతే కుప్పం మరో పులివెందుల అవుతుందని ఆక్షేపించారు.

ఇదీ చదవండి: Municipal Elections: రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.