ETV Bharat / state

పెళ్లింట విషాదం...విద్యుత్​ షాక్​తో వధువు అన్నయ్య మృతి

author img

By

Published : Jun 10, 2020, 10:07 AM IST

మరికొన్ని గంటల్లో చెల్లి పెళ్లి... ఇళ్లంతా బంధువులతో సందడిగా ఉంది. అందరూ వివాహ సంబరాల్లో ఉన్న సమయంలో... వధువు అన్నయ్య విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సందడిగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

person died due to current shock
కరెంట్ షాక్​తో వధువు అన్న మృతి

చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం జర్రవారిపల్లెలో ఓ పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి పనులు చేస్తుండగా విద్యుత్​ షాక్​తో వధువు అన్నయ్య మృతి చెందాడు. గురుప్రకాష్ పలమనేరు మన గ్రోమోర్ సెంటర్​లో పని చేస్తున్నాడు. తన చెల్లెలు వివాహం కోసం వచ్చి... పెళ్లి పనులు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్​ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గురుప్రకాష్​ను ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

ఇదీ చదవండి: శేషాచలం అటవీప్రాంతంలో ఎగిసిపడిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.