ETV Bharat / state

Raids on Mining Areas: గనులశాఖ దాడుల్లో రూ.5 కోట్ల విలువైన గ్రానైట్ స్వాధీనం: డీఎంజీ

author img

By

Published : Jan 13, 2022, 10:27 PM IST

గనులశాఖ దాడులు
Raids on Mining Areas

Rs 5 crore Worth Granite seized: చిత్తూరు జిల్లాల్లో మైనింగ్​లపై గనులశాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.5 కోట్ల విలువైన గ్రానైట్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా డీఎంజీ వెంకటరెడ్డి వెల్లడించారు.

Raids on Mining Areas and Granite seized: గనులశాఖ దాడుల్లో రూ.5 కోట్ల విలువైన గ్రానైట్ స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా డీఎంజీ వెంకటరెడ్డి వెల్లడించారు. మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో జిల్లాలోని మైనింగ్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. చిత్తూరు డీఎంజీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో.. 4 బృందాల మైనింగ్ ప్రాంతాలల్లో దాడులు నిర్వహించాయి. కుప్పం అటవీప్రాంతంలోని మైనింగ్ ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. శాంతిపురం, ద్రవిడ వర్సిటీ ప్రాంతంలోని మైనింగ్‌పై దాడులు చేసి 40 గ్రానైట్ బ్లాక్స్, 6 కంప్రెషర్లు, 2 హిటాచీలు సీజ్​ చేశారు. గనులశాఖ దాడుల్లో రూ.5 కోట్ల విలువైన గ్రానైట్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎంజీ వెల్లడించారు. సీజ్ చేసిన ఖనిజాల వేలానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డీఎంజీ వెంకటరెడ్డి తెలిపారు.

అక్రమ మైనింగ్ నివారణకు చెక్‌పోస్టులు: డీఎంజీ
అక్రమ మైనింగ్​పై ఉక్కుపాదం మోపినట్లు డీఎంజీ వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్​ను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘా పెంచామన్నారు. రెవెన్యూ, పోలీసు, గనులశాఖ అధికారులతో మొబైల్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ చదవండి..Deputy CTM: 'పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి...మాస్కు లేకపోతే జరిమానా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.