ETV Bharat / state

infant child dead body: జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం

author img

By

Published : Dec 6, 2021, 9:16 AM IST

Updated : Dec 6, 2021, 12:36 PM IST

జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం
జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం

infant child dead body: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం స్థానికులను కలిచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

infant child dead body: చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం రేపింది. ఉదయం బహిర్భూమికి వెళ్తున్న గ్రామస్థులకు మృత శిశువు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శిశువు చెవి, నోటి నుంచి రక్తం వస్తుండడంతో ఎవరో కావాలనే ఎత్తునుంచి పారేసి వెళ్లినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. హైవేపై ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇదీచదవండి:

palle velugu bus colors: పల్లె వెలుగు బస్సులకు కొత్త రంగు

Last Updated :Dec 6, 2021, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.