ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM

author img

By

Published : Nov 8, 2022, 9:01 PM IST

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

  • ఈనెల 11న ప్రధాని విశాఖ పర్యటన.. కార్యక్రమాలివే..
    Pm Tour In Visakha: ఈ నెల 11న ప్రధాని విశాఖకు రానున్నారు. ఆ రోజు రాత్రి విశాఖలోనే బస చేసి మరుసటి రోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో పర్యటన ముగిసిన అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్​ బయల్దేరి వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి ఊరట.. కేసు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
    TS HC Dismissed The OMC Case Against The IAS Officer : ఓబుళాపురం గనుల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సీబీఐ పేర్కొన్న అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఛార్జ్​షీట్​లో సీబీఐ నమోదు చేసిన సెక్షన్లకు తగిన ఆధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఆ సెక్షన్లు కాకుండా ఇతర చట్టనిబంధనలు వర్తిస్తాయేమో సీబీఐ కోర్టు పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ ఇతర అభియోగాలు వర్తిస్తే వాటి ప్రకారం శ్రీలక్ష్మిపై విచారణ కొనసాగించ వచ్చని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత.. కారణం అదే: మంత్రి ధర్మాన
    MINISTER DHARMANA : మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ‌ప్రజల్లో వ్యతిరేకత ఉందని శ్రీకాకుళం జిల్లాలోని గడప గడప కార్యక్రమంలో ప్రస్తావించారు. అయితే దానికి ప్రజలు సంస్కరణలు అర్థం చేసుకోకపోవడం వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Ippatam: ఇప్పటం గ్రామస్థులకు పవన్​ అండ.. వారికి ఆర్థిక సాయం
    Pawan Kalyan: ఇప్పటం గ్రామస్థులకు మరోసారి పవన్​ అండగా నిలిచారు. ఇళ్లు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి జనసేనాని లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ త్వరలోనే అందజేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'చట్టానికి లోబడే తీర్పు'.. అత్యాచార దోషులకు శిక్ష రద్దుపై సుప్రీం వివరణ
    సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను నిర్దోషులుగా తేల్చడంపై విమర్శలు వెల్లువెత్తగా.. వాటికి తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. కింది కోర్టుల్లో ఈ కేసు విచారణ సమయంలో అనేక లోపాలు జరిగినట్లు పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానంలో నిందితులు నేరానికి పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న ధర్మాసనం.. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద వారికి విముక్తి కల్పించినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలీసు ఇలాఖాలో ఆయుధాలు మాయం.. తుపాకీ బ్యారెళ్ల స్థానంలో పైపులు!
    రాజస్థాన్​లోని ఓ పోలీసు ఆయుధ శాఖలో ఆయుధాలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. దాదాపు 317 ఆయుధాలు మాయమయ్యాయని విచారణలో తేలింది. ఈ మేరకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు ఆ ఆయుధ శాఖ ఇన్‌ఛార్జ్‌పై కేసు నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కాప్‌-27' సమావేశం నుంచి బయటికెళ్లిన రిషి సునాక్.. చెవిలో చెప్పిన కొద్దిసేపటికే!
    Cop 27 Rishi Sunak : పర్యావరణ సదస్సులో భాగంగా ఓ సమావేశంలో పాల్గొన్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అర్థాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన హడావుడిగా బయటికెళ్లిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'వేషాలేస్తే ఖాతా తీసేస్తా' ఎలాన్​ మస్క్​ మాస్​ వార్నింగ్
    Elon Musk Warning : ఎలాన్ మస్క్​ ట్విట్టర్​ పిట్టని సంస్కరణల దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇది వరకే సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను తొలగించిన మస్క్.. తాజాగా ఓ వార్నింగ్ ఇచ్చారు. అలా చేస్తే హెచ్చరికలు లేకుండానే ఖాతాలను తొలగిస్తామని తెలిపారు. ఇంతకీ ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 World Cup ఫైనల్​లో టీమ్ఇండియా, పాకిస్థానే తలపడతాయి: డివిలియర్స్​
    De Villiers on T20 WC Final: టీమ్​ఇండియా, పాకిస్థానే ఫైనల్లో తలపడతాయని అన్నాడు సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్. బుధవారం (నవంబర్‌ 9), గురువారం (నవంబర్‌ 10)లలో జరగబోయే రెండు సెమీఫైనల్స్‌తో ఫైనల్లో తలపడబోయే టీమ్స్ ఏవో తేలనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ సూపర్​ హిట్​ సినిమాలో బాలకృష్ణను వద్దన్న ఎన్టీఆర్‌.. ఎందుకంటే?
    ఓ సూపర్ హిట్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించడానికి సీనియర్​ ఎన్టీఆర్​ నో చెప్పారట. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎందుకు అలా అన్నారంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.