ETV Bharat / state

Road accident: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం

author img

By

Published : Nov 3, 2022, 10:29 AM IST

Road accident
రోడ్డు ప్రమాదం

Road accident: తెలంగాణలోని వికారాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలా జరిగిందంటే..?

Vikarabad Road Accident Today: తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం బ్రిడ్జి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతులు ఆటో డ్రైవర్ జమీల్‌, హేమ్లా, రవి, కిషన్, సోనీ బాయ్​గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్​ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.