ETV Bharat / state

యాజమాన్యం తీరును నిరసిస్తూ... ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల ధర్నా

author img

By

Published : Mar 25, 2021, 5:08 PM IST

students protest in anantapuram arts college
అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల నిరసన

అనంతపురంలో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యాదీవెన పథకం అమలు కోసం ఒకే కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. యాజమాన్యం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఏఐఎస్​ఎఫ్​ నాయకులు మండిపడ్డారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

విద్యాదీవెన పథకం అమలు పట్ల ఆర్ట్స్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని.. అనంతపురంలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం కోసం ఒకే కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. అదనపు సెంటర్లు నెలకొల్పాలని డిమాండ్ చేశారు.

కళాశాలలో అనేక సమస్యలు ఉన్నా.. ప్రిన్సిపల్ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఏఐఎస్​ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మనోహర్ ఆరోపించారు. వాటి పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

మయూరాల ప్రాణాలు తీసిన కరెంటు తీగ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.