ETV Bharat / state

liquor seized: 2,304 మద్యం పాకెట్లు స్వాధీనం... ఆరుగురు అరెస్టు

author img

By

Published : Jun 14, 2021, 9:44 AM IST

liquor seized
మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా ఎర్రగుంటలో పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి... 2,304 మద్యం పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతపురం జిల్లా కనేకల్ మండంలం ఎర్రగుంటలో పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్న 6 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 24 కేసుల (2,304 ప్యాకెట్ల) మద్యాన్ని, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

4టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.