లైవ్​షోలో క్రికెటర్ల హాఫ్​ న్యూడ్​ ఫొటోలు.. ఇబ్బందిపడ్డ 'మయంతి'.. నెటిజన్లు ఫుల్​ ఫైర్​!

author img

By

Published : May 19, 2023, 5:34 PM IST

Updated : May 19, 2023, 6:44 PM IST

IPL 2023 Star Sports Hot or Not

స్టార్​ స్పోర్ట్స్​ ఛానెల్​లో ఐపీఎల్​ మ్యాచ్​కు ముందు ప్రసారమయ్యే ఓ ప్రోగ్రామ్​ పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. స్పోర్ట్స్​ ఛానెల్​లో అలాంటి షో లు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ షో ఏంటి? ఏం జరిగింది?

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ బ్రాడ్​కాస్టర్ స్టార్​ స్పోర్ట్స్.. మ్యాచ్​కు ముందు స్టూడియోలో 'హాట్ ఆర్ నాట్​' అనే పేరుతో నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ పట్ల నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. క్రికెట్​ గురించి, క్రికెటర్లపై ప్రశ్నలు​ అడిగే నేపథ్యంలో సాగే ఈ షో ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. ఇలా పలు కార్యక్రమాల పేరిట మహిళా యాంకర్లను స్టూడియోలకు పిలిచి వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. అసలే జరిగిందంటే?

తాజాగా గురువారం సన్​రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్​ ప్రారంభమయ్యే ముందు స్టార్​ స్పోర్ట్స్​లో నిర్వహించిన 'హాట్ ఆర్ నాట్' షోలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్​ బిన్నీ కోడలు, టీమ్​ఇండియా ఆల్​రౌండర్ స్టువర్ట్​ బిన్నీ.. సతీమణి మయంతి సహా మరో ముగ్గురు మహిళా యాంకర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్​, సురేన్ సుందరం కలిసి నిర్వహించారు. ప్రోగ్రామ్​లో భాగంగా వారు భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శుభ్​మన్ గిల్​తో పాటు వెస్టిండీస్ బ్యాటర్ ఆండ్రీ రసెల్​ల అర్ధనగ్న ఫొటోలను (చొక్కా లేకుండా ఉన్న ఫొటోలు) స్క్రీన్​పైన చూపిస్తూ ఎవరు హాట్​గా ఉన్నారో చెప్పాల్సిందిగా ప్రశ్నించారు.

ఈ ఫొటోల్లో వారందరూ కూడా స్విమ్మింగ్ ఫూల్​లో ఉన్నప్పుడు తీసినట్టుగా ఉన్నాయి. వాటిపై వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటం అటుంచితే.. అసలు వాటిని చూసేందుకే ఆ యాంకర్లు ఇబ్బంది పడ్డారు. సోషల్ మీడియాలో ఇది గమనించిన పలువురు షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. "ఇది క్రికెట్​ షోనేనా లేదంటే ఇంకేమైనా సెన్సార్ షోనా?' మహిళా యాంకర్లను పిలిచి ఇలా ఇబ్బందులకు గురయ్యే ప్రశ్నలు అడగటం ఏంటి? స్పోర్ట్స్​కు సంబంధించి మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించకోవచ్చు. అంతేకానీ పిచ్చి పిచ్చి షోలు చేసి క్రికెట్ ప్రతిష్ఠను దిగజార్చొద్దు" అని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

అయితే హైదరాబాద్​- బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్​లో రెండు శతకాలు నమోదయ్యాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే మ్యాచ్​లో సెంచరీలు చేయటం ఐపీఎల్​లో ఇదే తొలిసారి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్​ ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆ జట్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ (104) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం ఛేజింగ్​కు దిగిన బెంగళూరు మొదటి నుంచే హైదరాబాద్​పై ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్లు విరాట్, డుప్లెసిస్​ ఏ దశలోనూ ఆరెంజ్​ఆర్మీ బౌలర్లకు ఛాన్స్​ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే విరాట్ భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్​ నాలుగో బంతికి సిక్స్​ బాది ఐపీఎల్​లో ఆరో శతకాన్ని నమోదు చేశాడు. తర్వాత విరాట్, డుప్లెసిస్(71) వెనుదిరిగినా మ్యాక్స్​వెల్, బ్రేస్​వెల్ మిగతా పని పూర్తి చేశారు. దీంతో బెంగళూరు.. ఈ సీజన్​లో ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

Last Updated :May 19, 2023, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.