ETV Bharat / international

పడవ బోల్తా.. 23 మంది దుర్మరణం.. అనేక మంది గల్లంతు

author img

By

Published : Sep 25, 2022, 4:58 PM IST

Updated : Sep 25, 2022, 5:40 PM IST

Boat Capsized Bangladesh : పడవ బోల్తా పడిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం బంగ్లాదేశ్​లో జరిగింది.

boat accident in bangladesh
boat accident in bangladesh

Boat Capsized Bangladesh : బంగ్లాదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడడం వల్ల 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఉత్తర బంగ్లాదేశ్​లోని పంచాగఢ్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ​ సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల బంగ్లాదేశ్​లో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్​లో గంగా, బ్రహ్మపుత్రతో కలిపి గతేడాది డిసెంబర్​లో జరిగిన ప్రమాదంలో సుమారు 37 మంది మరణించారు. అంతకుముందు నవంబర్​లో జరిగిన పడవ ప్రమాదంలో 85 మంది మృతి చెందారు.

Last Updated : Sep 25, 2022, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.