ETV Bharat / entertainment

ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన చిరు, తారక్​.. అలా చేయాలని రిక్వెస్ట్​!

author img

By

Published : Jun 3, 2023, 11:12 AM IST

Updated : Jun 3, 2023, 2:46 PM IST

Odisha Train Accident : ఒడిశాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. అభిమానులకు అలా చేయాలని సూచించారు.

Chiranjeevi
ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన చిరు.. వెంటనే అలా చేయాలని ఫ్యాన్స్​కు రిక్వెస్ట్​!

odisha rail accident Chiranjeevi : ఒడిశాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఘటనలో ప్రాణాలు కోల్పొయిన బాధిత కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు భారీగా రక్తం అవసరం అవుతుందని.. వారి ప్రాణాలు కాపాడేందుకు బ్లడ్ యూనిట్స్ ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ విషాదకర ఘటన గురించి తెలియగానే తాను షాక్​కు గురైనట్లు పేర్కొన్నారు.

  • Utterly shocked at the tragic Coromandel express accident in Orissa and the huge loss of lives! My heart goes out to the bereaved families.
    I understand there is an urgent demand for blood units to save lives. Appeal to all our fans and good samaritans in the nearby areas to…

    — Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Coromandel train accident today : "రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ వార్త తెలియగానే షాక్​కు గురయ్యాను. నా హృదయం ఎంతో బరువెక్కిపోయింది. ఇటువంటి సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం అవసరమని అర్థమవుతుంది. రక్తదానం చేసేందుకు సమీప ఆస్పత్రుల వద్ద ఫ్యాన్స్​, దగ్గర్లో ఉన్న ప్రజలు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని చిరు అన్నారు.

చాలా భాదాకరం : సల్మాన్‌ ఖాన్‌
"ఇలాంటి ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను"

ధైర్యాన్ని ప్రసాదించాలని : తారక్​
ఈ విషాదకర ఘటనపై జూనియర్​ ఎన్టీఆర్‌ కూడా స్పందించారు. "కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ఘటన వల్ల ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఇలాంటి కష్టకాలంలో వారందరికీ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని తారక్​ ట్వీట్‌ చేశారు.

  • Heartfelt condolences to the families and their loved ones affected by the tragic train accident. My thoughts are with each and every person affected by this devastating incident. May strength and support surround them during this difficult time.

    — Jr NTR (@tarak9999) June 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తగిన ఏర్పాట్లు చేయాలి : పవన్‌ కల్యాణ్‌
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై హీరో పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారిలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఉండే అవకాశం ఉందని అన్నారు. వారి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి విన్నాక నా హృదయం ముక్కలైపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. - అల్లు అర్జున్‌

  • Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured.

    — Virat Kohli (@imVkohli) June 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రైలు ప్రమాద ఘటన నా హృదయాన్ని ఎంతగానో కలచివేసింది. నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు" - యశ్‌

"రైలు ప్రమాద ఘటనతో నా హృదయం ముక్కలైపోయింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" - రష్మిక

odisha train accident
ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన సెలబ్రిటీలు
Last Updated :Jun 3, 2023, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.